Kendriya Vidyalaya Sangathan: న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ (KVS) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4014 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది

KVS LDCE 2022 Notification: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ (KVS) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేవీ స్కూళ్ల (KVS)లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ ఆపీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4014 పోస్టులను భర్తీ చేయనుంది. హిందీ, ఇంగ్లిష్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, సంస్కృతం, సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌

 

నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

సీటెట్‌ (CTET)లో అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మిగతా సమాచారాన్ని అధికారిక నోటిఫికేషన్‌లో లేదా https://kvsangathan.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

 

  • ప్రిన్సిపాల్ పోస్టులు- 278
  • వైస్‌ ప్రిన్సిపల్ పోస్టులు- 116
  • ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు- 7
  • సెక్షన్ ఆఫీసర్ పోస్టులు- 22
  • పీజీటీ పోస్టులు- 1200
  • టీజీటీ పోస్టులు- 2154
  • హెడ్ మాస్టర్ పోస్టులు- 237

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *